మౌంట్మాంగనీ: మహిళల వన్డే ప్రపంచ కప్లో (Women’s World Cup) భాగంగా డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్తో భారత్ తలపడుతున్నది. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన టీమ్ఇండియా పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. ఇంగ్లిష్ బౌలర్ల ధాటికి టీమ్ఇండియా బ్యాటర్లు చేతులెత్తేశారు. దీంతో 28 పరుగులకు మూడు వికెట్లు కోల్పోయింది.
దీంతో గత మ్యాచ్లో సెంచరీలతో అదగొట్టిన బ్యాటర్లు స్మృతి మంధాన, హర్మన్ ప్రీత్కౌర్పై భారత్ ఆశలు పెట్టుకున్నది. ఆది నుంచి ఆచితూచి ఆడుతున్న స్మృతి 34 బంతుల్లో 28 పరుగులు చేయగా, ఇప్పుడే క్రీజులోకి వచ్చిన హర్మన్ మరో వికెట్ చేజారకుండా బ్యాటింగ్ చేస్తున్నది. ప్రస్తుతం 11 ఓవర్లు ముగిసే సరికి మూడు వికెట్లు కోల్పోయిన భారత్.. 39 పరుగులు మాత్రమే చేసింది.
ఇన్నింగ్స్ మూడో ఓవర్లోనే బ్యాటర్ యస్తికా భటియాను వికెట్ కోల్పోయింది. 11 బాల్స్లో 8 పరుగులు చేసిన యస్తియా.. జట్టు స్కోరు 18 రన్స్ వద్ద శ్రుబ్సోలే బౌలింగ్లో మొదటి వికెట్గా వెనుతిరింది. తరువాత క్రీజ్లోకి వచ్చిన కెప్టెన్ మిథాలీ రాజ్ కూడా ఎక్కువసేపు నిలువలేకపోయింది. ఒక్క పరుగు మాత్రమే చేసిన మిథాలీ.. ఐదో ఓవర్లో క్యాచౌట్ అయింది. అనంతరం బ్యాటింగ్కు వచ్చిన దీప్తీ శర్మ డకౌట్గా వెనుతిరిగింది.