Badminton | షా ఆలమ్(మలేషియా): ప్రతిష్ఠాత్మక ఆసియా బ్యాడ్మింటన్ టీమ్ చాంపియన్షిప్లో భారత అమ్మాయిల కొత్త చరిత్ర లిఖించారు. టోర్నీలో తొలిసారి ఫైనల్ పోరుకు అర్హత సాధించి ఔరా అనిపించారు. శనివారం జరిగిన సెమీస్లో మన అమ్మాయిల జట్టు 3-2తో రెండు సార్లు చాంపియన్ జపాన్పై చిరస్మరణీయ విజయం సాధించింది. సెమీస్ విషయానికొస్తే..తొలుత జరిగిన సింగిల్స్లో పీవీ సింధు 13-21, 20-22తో అయా ఒహోరీ చేతిలో ఓటమిపాలైంది.
ఆ తర్వాత డబుల్స్లో గాయత్రి గోపీచంద్, త్రిసాజాలీ జోడీ 21-17,16-21, 22-20తో ప్రపంచ ఆరో ర్యాంక్ ద్వయం నమి మత్సుయమ, చిహారు షిదాపై సంచలన విజయం సాధించింది. తమ(23వ ర్యాంక్) కంటే మెరుగైన ర్యాంక్లో ఉన్న వారిని గాయత్రి, త్రిసా మట్టికరిపించారు. మరో సింగిల్స్లో అశ్మిత 21-17, 21-14తో నజోమి ఒకుహరపై గెలువడంతో భారత్ 2-1 ఆధిక్యంలోకి వెళ్లింది. డబుల్స్లో సింధు, అశ్విని ద్వయం 14-21, 11-21తో రీనా మియురా, అయాకో సకురామోటో జోడీ చేతిలో ఓడటంతో స్కోరు 2-2తో సమమైంది. సింగిల్స్లో అన్మోల్ 21-14, 21-18తో నత్సుకిపై గెలిచి భారత్ను ఫైనల్ చేర్చడంలో కీలకమైంది.