Womens T20 WC : మహిళల టీ20 వరల్డ్ కప్ నాకౌట్ మ్యాచ్లో ఇంగ్లండ్ భారీ స్కోర్ చేసింది. మిడిలార్డర్ బ్యాటర్ సీవర్ బ్రంట్ హాఫ్ సెంచరీతో చెలరేగింది.దాంతో ఇంగ్లండ్ నిర్ణీత ఓవర్లలో 151 రన్స్ చేసింది. సీవర్ ఔటయ్యాక అమీ జోన్స్(40) ఫోర్లు, సిక్సర్లతో చెలరేగింది. ఆఖరి ఓవర్లో రేణుకా సింగ్ సింగ్ ఆమెను ఔట్ చేయడంతో భారత్ ఊపిరి పీల్చుకుంది.
ఆ తర్వాతి బంతికే క్యాథెరిన్ సీవర్ బ్రంట్ను రేణుక ఔట్ చేసింది. దాంతో, రేణుకా సింగ్ హ్యాట్రిక్ సాధించేలా కనిపించింది. కానీ, ఆఖరి బంతికి బై రూపంలో నాలుగు పరుగులు రావడంతో హ్యాట్రిక్ ఛాన్స్ మిస్ అయింది. రేణుకా సింగ్ ఐదు వికెట్లు పడగొట్టింది.
ఫిఫ్టీ పార్ట్నర్షిప్
కీలక మ్యాచ్లో ఇంగ్లండ్ బ్యాటర్ నాట్ సీవర్ బ్రంట్ హాఫ్ సెంచరీ కొట్టింది. 41 బంతుల్లో ఫిఫ్టీ పూర్తి చేసుకుంది. అమీ జోన్స్(26)తో కలిసి ఐదో వికెట్కు 38 రన్స్ జోడించింది. ఫాస్ట్ బౌలర్ రేణుకా సింగ్ విజృంభించడంతో ఇంగ్లండ్ మూడు ప్రధాన వికెట్లు కోల్పోయింది. ఆ సమయంలో.. నాట్ సీవర్ బ్రంట్ , హీథర్ నైట్ జట్టును ఆదుకున్నారు. వీళ్లిద్దరూ దూకుడుగా ఆడుతూ స్కోర్బోర్డును పరుగులు పెట్టించారు. మరో వికెట్ పడకుండా చూసుకుంటూనే వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలు బాదారు. మూడో వికెట్కు ఫిఫ్టీ రన్స్ జోడించారు.
29 రన్స్కే మూడు వికెట్లు
టాస్ ఓడిపోయి బ్యాటింగ్కు దిగిన ఇంగ్లండ్ను భారత పేసర్ రేణుకా సింగ్ హడలెత్తించింది. పవర్ ప్లేలోపే మూడు వికెట్లు పడగొట్టింది. తొలి ఓవర్ మూడో బంతికి ఓపెనర్ వ్యాట్ను ఔట్ చేసింది. అప్పటికే షాక్లో ఉన్న ఇంగ్లండ్ను ఆమె తన రెండో ఓవర్లో మళ్లీ దెబ్బ కొట్టింది. క్యాప్సేను బౌల్డ్ చేసింది. తన మూడో ఓవర్లో డంక్లేను బౌల్డ్ చేసి ఆ జట్టును మరింత కష్టాల్లోకి నెట్టింది.