దుబాయ్: మహిళల ఆసియా కప్ను ఘనవిజయంతో ప్రారంభించిన భారత్ రెండో పోరుకు సిద్ధమైంది. గురువారం హాంకాంగ్తో జరుగబోయే మ్యాచ్తో గెలిచి సెమీస్ బెర్తును ఖాయం చేసుకోవాలనే లక్ష్యంతో బరిలోకి దిగుతున్నది. థాయ్లాండ్తో తొలి మ్యాచ్లో విఫలమైన భారత బ్యాటర్లు.. ఈ పోరుతో అయినా జోరందుకోవాలని జట్టు మేనేజ్మెంట్ ఆశిస్తున్నది. థాయ్లాండ్తో 10 ఓవర్లకు 101/2తో నిలిచిన హర్మన్ప్రీత్ సేన.. చివరి ఏడు వికెట్లను 29 పరుగులకు కోల్పోయి 159కే పరిమితమైంది. టాపార్డర్లో షెఫాలీ, ప్రతీక రావల్ మినహా మిగిలిన బ్యాటర్లంతా చేతులెత్తేశారు. హాంకాంగ్తో పోరులో అయినా మంధాన, రిచా, హర్మన్ బ్యాట్లకు పనిచెబితే భారత్కు భారీ స్కోరు ఖాయం.