టీ20 వరల్డ్ కప్ మ్యాచ్లన్నీ అరబ్ దేశాల్లో జరుగుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా దుబాయ్ స్టేడియంలో రాత్రి పూట 7.30 కు ప్రారంభం అయ్యే మ్యాచ్లపై ఖచ్చితం మంచు ప్రభావం ఉంటుంది. మన దగ్గర రాత్రి 7.30 కానీ.. అక్కడ సాయంత్రం 6 గంటలకే మ్యాచ్ ప్రారంభం అవుతుంది. దుబాయ్ కాలమానం ప్రకారం సాయంత్రం 6 గంటలకు మ్యాచ్ ప్రారంభం అయినప్పుడు పెద్దగా మంచు ప్రభావం ఉండటం లేదు కానీ.. ఒక టీమ్ ఇన్నింగ్స్ ముగిశాక.. మంచు తన ప్రతాపం చూపిస్తోంది. విపరీతంగా మంచు కురుస్తుండటం వల్ల బౌలింగ్ సరిగ్గా పడటం లేదు. స్టేడియంలో ఉండే గడ్డి మొత్తం తేమగా మారిపోవడం వల్ల పిచ్ బౌలింగ్కు సహకరించకుండా.. బ్యాటింగ్కు సహకరిస్తున్నట్టు ఇప్పటి వరకు జరిగిన చాలా మ్యాచ్లలో రుజువు అయింది. దీన్నే మనం డ్యూ ఫ్యాక్టర్(Dew Factor) అని కూడా అంటాం.
అందుకే.. ఈ మ్యాచ్లో కూడా టాస్ గెలవడం కీలకం కాబోతోంది. టాస్ గెలిచిన జట్టు ఖచ్చితంగా ఫీల్డింగ్ ఎంచుకోవడానికే మొగ్గు చూపుతుంది. ఇప్పటి వరకు జరిగిన మ్యాచ్లలో 90 శాతం టాస్ గెలిచిన జట్లు ఫీల్డింగే ఎంచుకున్నాయి. ఛేజింగ్ దుబాయ్ స్టేడియంలో ఈజీ అవుతోంది. అందుకే.. టాస్ ఏ టీమ్ గెలిస్తే.. ఆ టీమే ఈ సారి టోర్నీ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అన్నమాట.
అయితే.. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్.. రెండు టీమ్స్ కూడా ఛేజింగ్కే ప్రాధాన్యతను ఇస్తున్నట్టు కనిపిస్తున్నాయి. అందుకే.. ఏ టీమ్ టాస్ గెలిచినా.. ఏమాత్రం ఆలోచించకుండా ఫీల్డింగ్ తీసుకునే అవకాశం ఉంది. ఛేజింగ్ చేసి ప్రత్యర్థిని చిత్తు చేసి టీ20 వరల్డ్ కప్ను గెలవాలని ఆశపడుతున్నాయి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
T20 World Cup Final : ఈసారి ట్రోఫీ ఆ జట్టుకేనట.. ఎలాగో కూడా చెప్పేసిన నెటిజన్లు
ఆసీస్, కివీస్ ఎన్నిసార్లు టీ20లలో పోటీపడ్డాయి? ఏ టీమ్ ఎక్కువసార్లు గెలిచింది?
VVS Laxman | జాతీయ క్రికెట్ అకాడమీ డైరెక్టర్గా వీవీఎస్ లక్ష్మణ్