Virat Kohli | న్యూఢిల్లీ: రానున్న ప్రతిష్ఠాత్మక టీ20 ప్రపంచకప్లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ బరిలోకి దిగుతాడా లేదా అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. వెస్టిండీస్, అమెరికా వేదికలుగా జూన్లో జరిగే మెగాటోర్నీ కోసం ప్రకటించే జట్టులో కోహ్లీకి చోటు దక్కకపోవచ్చని వార్తలు వెలువడుతున్నాయి. విరాట్ను తప్పించి యువ క్రికెటర్లకు అవకాశమివ్వాలనే ఆలోచనతో అగార్కర్ నేతృత్వంలోని సెలెక్షన్ కమిటీ యోచిస్తున్నట్లు తెలుస్తున్నది. దీనికి తోడు విండీస్, అమెరికాలో ఉండే స్లో పిచ్లు కోహ్లీ ఆటతీరుకు సరిపోవని అందుకే అతన్ని తప్పించే అవకాశాలు మెండుగా ఉన్నట్లు బోర్డు వర్గాల వినికిడి.
ఆస్ట్రేలియా వేదికగా జరిగిన గత టీ20 ప్రపంచకప్లో పరుగుల వరద పారించిన కోహ్లీ..అఫ్గానిస్థాన్తో సిరీస్ వరకు పొట్టి ఫార్మాట్కు దూరంగా ఉన్నాడు. ప్రపంచకప్లో రోహిత్శర్మ కెప్టెన్సీలో భారత్ బరిలోకి దిగుతుందని కార్యదర్శి జైషా ప్రకటించిన నేపథ్యంలో కోహ్లీకి చోటు లభిస్తుందని ఆశించారు. మెగాటోర్నీ కోసం మే 1ఆఖరి తేదీ అయినందున ఏం జరుగుతుందనేది ఆసక్తికరంగా మారింది.