గత ఐపీఎల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) అభిమానులకు విరాట్ కోహ్లీ షాకిచ్చాడు. తను ఆర్సీబీ కెప్టెన్సీకి వీడ్కోలు పలుకుతున్నానని, ఆటగాడిగా కొనసాగుతానని ప్రకటించాడు. దీంతో అభిమానులు షాకయ్యారు. కోహ్లీ తర్వాత ఆర్సీబీ కెప్టెన్ ఎవరు? అనే ప్రశ్న వాళ్లను పట్టిపీడించడం మొదలుపెట్టింది.
ఇలాంటి సమయంలో 2022 మెగావేలంలో సౌతాఫ్రికా మాజీ సారధి ఫాఫ్ డు ప్లెసిస్, కోల్కతా నైట్ రైడర్స్ మాజీ కెప్టెన్ దినేష్ కార్తీక్ను ఆర్సీబీ యాజమాన్యం కొనుగోలు చేసింది. వీరికితోడు జట్టులో మ్యాక్స్వెల్ ఉండనే ఉన్నాడు. ఈ ముగ్గురికీ కెప్టెన్సీ చేసిన అనుభవం ఉంది. అయితే కొత్త కెప్టెన్పై సందిగ్ధత నెలకొన్న నేపథ్యంలో కోహ్లీకే ఈ ఏడాది కూడా జట్టు పగ్గాలు అందించే అవకాశం ఉందనే వార్త ప్రచారంలో ఉంది.
దీనిపై ఆర్సీబీ మాజీ సారధి, న్యూజిల్యాండ్ వెటరన్ డేనియల్ వెట్టోరీ స్పందించాడు. “ఈ ప్రశ్నకు సమాధానం చాలా సింపుల్. అది జరగదు. ఎందుకంటే అది ఫ్రాంచైజీ క్రికెట్ అయినా, లేదంటే అంతర్జాతీయ క్రికెట్ అయినా.. ఒక కెప్టెన్ ఆటగాడిగా కొనసాగాలని అనుకుంటే, అదే చేయాలి” అని తెలిపాడు.
కోహ్లీ, డుప్లెసిస్, మ్యాక్స్వెల్ను నాయకత్వ పాత్రలో ఉంచుతారని, మ్యాక్స్వెల్ స్థానంలో డుప్లెసిస్ సారధ్య బాధ్యతలు తీసుకోవచ్చని అభిప్రాయపడ్డాడు. అయితే మొదటి మూడు మ్యాచులూ గెలిస్తే మ్యాక్స్వెల్ కొనసాగే అవకాశం ఉందన్నాడు.