కోల్కతా: కరోనా ప్రభావంతో భారత్లో ఈ ఏడాది టీ20 ప్రపంచకప్ను నిర్వహించలేకపోతే తమ వద్ద ప్లాన్-బి ఉందని ఐసీసీ సీఈవో అలార్డైస్ చెప్పగా.. మరోవైపు మెగాటోర్నీకి అత్యుత్తమంగా ఆతిథ్యమిస్తామని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ధీమా వ్యక్తం చేశాడు. దేశంలో కరోనా వైరస్ పరిస్థితులు త్వరలోనే సద్దుమణుగుతాయని దాదా ఆశిస్తున్నామన్నాడు. రాష్ట్ర క్రికెట్ సంఘాలకు ఇటీవల రాసిన లేఖలో దాదా మెగాటోర్నీకి సంబంధించిన విషయాలను పేర్కొన్నాడు. ‘త్వరలోనే మళ్లీ సాధారణ పరిస్థితులు నెలకొంటాయని ఆశిస్తున్నా. పూర్తిస్థాయి దేశవాళీ సీజన్తో పాటు టీ20 ప్రపంచకప్నకు అత్యుత్తమంగా ఆతిథ్యమివ్వనున్నాం’ అని గంగూలీ పేర్కొన్నాడు. షెడ్యూల్ ప్రకారం ఈ ఏడాది అక్టోబర్ – నవంబర్ మధ్య పొట్టి ప్రపంచకప్ జరుగాల్సి ఉంది.