భారత్తో జరుగుతున్న రెండో వన్డేలో వెస్టిండీస్ బ్యాటర్లు అదరగొడుతున్నారు. తన కెరీర్లో 100వ వన్డే ఆడుతున్న ఓపెనర్ షాయి హోప్ (26 నాటౌట్)తోపాటు మరో ఓపెనర్ కైల్ మేయర్స్ (39) కూడా అదరగొట్టాడు. వీళ్ల భాగస్వామ్యాన్ని విడగొట్టేందుకు భారత బౌలర్లు చాలా కష్టపడుతున్నారు. ఈ మ్యాచ్తో వన్డేల్లో అరంగేట్రం చేసిన ఆవేష్ ఖాన్ బౌలింగ్లో విండీస్ ఓపెనర్లు భారీ షాట్లు ఆడారు.
శార్దూల్ ఠాకూర్ బౌలింగ్ను కూడా ఒక ఆట ఆడుకున్నారు. మహమ్మద్ సిరాజ్ ఒక్కడే విండీస్ ఓపెనర్ల జోరుకు కొద్దిగా కళ్లెం వేశాడు. ఇలాంటి సమయంలో పదో ఓవర్లో బంతి అందుకున్న దీపక్ హుడా తన తొలి బంతికే మేయర్స్ను పెవిలియన్ చేర్చాడు. హుడా వేసిన బంతిని ఆడే క్రమంలో మేయర్స్ నేరుగా కొట్టాడు. దాన్ని హుడానే క్యాచ్ పట్టేయడంతో మేయర్స్ ఇన్నింగ్స్ ముగిసింది. ఈ క్రమంలో 10 ఓవర్లు ముగిసే సరికి విండీస్ జట్టు ఒక వికెట్ నష్టానికి 71 పరుగులతో నిలిచింది.