వెస్టిండీస్తో జరుగుతున్న మూడో వన్డేలో భారత జట్టుకు నిలకడైన ఆరంభం లభించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత సారధి ధావన్ నిలకడగా ఆడుతున్నాడు. ధావన్ (22 నాటౌట్), శుభ్మన్ గిల్ (22 నాటౌట్) ఇద్దరూ అనవసర షాట్లకు పోకుండా ఇన్నింగ్స్ నిర్మిస్తున్నారు. ఈ క్రమంలో తొలి పవర్ప్లే పది ఓవర్లు ముగిసే సరికి భారత జట్టు వికెట్లేమీ కోల్పోకుండా 45 పరుగులతో నిలిచింది.