అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) తన వార్షిక క్రికెట్ అవార్డులను ప్రకటించింది. 2021 ఏడాదికి విడుదలైన ఈ అవార్డుల్లో పురుషుల టీ20 క్రికెటర్ ఆఫ్ ది ఇయర్గా పాకిస్తాన్ ఓపెనర్ మొహమ్మద్ రిజ్వాన్ అవార్డు అందుకున్నాడు. మహిళల టీ20 క్రికెటర్గా ఇంగ్లండ్ క్రీడాకారిణి టామీ బ్యూమంట్ నిలిచింది.
పురుషుల అసోసియేట్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్గా ఒమన్ ప్లేయర్ జీషన్ మక్సూద్ అవార్డు అందుకోగా.. మహిళల అసోసియేట్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును ఆస్ట్రియాకు చెందిన ఆండ్రియా మే జెపెడా అందుకుంది. గతేడాది మొత్తం 8 టీ20 మ్యాచులు ఆడిన ఆండ్రియా.. 51.57 సగటుత 361 పరుగులు చేసింది. వీటిలో ఒక సెంచరీ, రెండు అర్ధశతకాలు ఉన్నాయి.