క్రికెట్ ప్రపంచంలో కెప్టెన్ కోహ్లీ శకం ముగిసింది. భారత్ తరఫున అత్యుత్తమ టెస్టు సారధిగా కోహ్లీ తన కెప్టెన్సీ కెరీర్ ముగించాడు. దీంతో క్రికెట్ లోకం మొత్తం స్టన్ అయింది. అంతేకాదు, కోహ్లీ తర్వాత జట్టు పగ్గాలందుకునేదెవరు? అనే ప్రశ్న లేవనెత్తింది.
ఇప్పటికే వన్డే, టీ20 కెప్టెన్గా ఎంపిక చేసిన రోహిత్నే టెస్టు కెప్టెన్గా కూడా సెలెక్ట్ చేయాలని కొందరు అంటున్నారు. అయితే మాజీ దిగ్గజం సునీల్ గవాస్కర్ మాత్రం మరో సూచన చేశాడు. కోహ్లీ తర్వాత టెస్టు కెప్టెన్సీని యువ వికెట్ కీపర్ రిషభ్ పంత్కు అందించాలని సజెస్ట్ చేశాడు. దీనికి ఒక కారణం కూడా చెప్పాడు.
‘‘ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ సారధిగా రికీ పాంటింగ్ తప్పుకోగానే.. ఆ బాధ్యతను రోహిత్కు అప్పగించారు. ఇలా చేయడం వల్ల మరింత బాధ్యతగా ఆడిన రోహిత్.. తన 20, 30 పరుగులను 50లు, 100లుగా మలచడం ప్రారంభించాడు. అలాంటి బాధ్యతను రిషభ్ పంత్కు అప్పగిస్తే.. కేప్టౌన్ వంటి మరిన్ని అద్భుతమైన సెంచరీలు అతడు అందిచగలుగుతాడని నేను భావిస్తున్నా’’ అని సన్నీ వెల్లడించాడు.
ఏదిఏమైనా భారత టెస్టు కెప్టెన్గా ఎవరిని ఎంచుకోవాలనే తలనొప్పి మాత్రం సెలెక్టర్లకు ఉంటుందని పేర్కొన్నాడు.