HCA | హైదరాబాద్, ఆట ప్రతినిధి: హైదరాబాద్ క్రికెట్ సంఘం(హెచ్సీఏ)లో గత కొన్నేండ్లుగా కొనసాగుతున్న బహుళ క్లబ్ల ఆధిపత్య ధోరణికి రోజులు దగ్గర పడ్డాయి. సుప్రీం కోర్టు నియమించిన జస్టిస్ లావు నాగేశ్వర్రావు నేతృత్వంలోని ఏకసభ్య కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది.
కొంత మంది వ్యక్తులు లెక్కకు మిక్కిలి క్లబ్లు కల్గి ఉన్నారన్న నిర్ధారణకు వచ్చిన ఏకసభ్య కమిటీ ఆ దిశగా చర్యలు చేపట్టింది. రానున్న హెచ్సీఏ ఎన్నికల్లో పోటీ చేసేందుకు, ఓటు వేసేందుకు వీలు లేకుండా హెచ్సీఏలోని 57 క్లబ్పై కమిటీ కొరడా ఝులిపించింది. దీంతో ఎన్నికల ప్రక్రియలో ఈ క్లబ్లకు ప్రాతినిధ్యం లేకుండా పోనుంది.