వచ్చే ఐపీఎల్ సీజన్ నుంచి రెండు కొత్త జట్లు టోర్నీలో తమ జర్నీ ప్రారంభించనున్న సంగతి తెలిసిందే. వాటిలో లక్నో నుంచి ఒక కొత్త జట్టు వచ్చింది. దీనికి ‘లక్నో సూపర్ జయంట్స్’ అని పేరు పెట్టారు. ఈ జట్టుకు మెంటార్గా భారత మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ ఉన్నాడు.
భారత స్టార్ ఓపెనర్ కేఎల్ రాహుల్ను ఈ ఫ్రాంచైజీ ఏకంగా రూ.17 కోట్లు పెట్టి కొనుగోలు చేసింది. ఈ నిర్ణయాన్ని జట్టు మెంటార్ గంభీర్ సమర్ధించాడు. రాహుల్ను ఎంపిక చేయడంలో అసలు ఆలోచనే అవసరం లేదన్నాడు. రాహుల్ మూడు పాత్రలు పోషించగలడని గంభీర్ అన్నాడు.
‘‘అతను ఓపెనర్గా రాణించగలడు, వికెట్ కీపింగ్ చేయగలడు, అన్నిటికీ మంచి వైట్ బాల్ క్రికెట్లో అత్యద్భుతమైన బ్యాటర్.. అందుకే అతని ఎంపిక విషయంలో పెద్దగా ఆలోచించాల్సిన అవసరమే రాలేదు’’ అని గంభీర్ వివరించాడు.
లక్నో జట్టు రాహుల్తోపాటు మార్కస్ స్టొయినిస్, రవి బష్ణోయిని ప్లేయర్ పూల్ నుంచి కొనుగోలు చేసింది. వీరిలో రాహుల్ను జట్టు సారధిగా నియమించింది.