IND vs WI : భారత్, వెస్టిండీస్ జట్లు కీలకమైన నాలుగో టీ20 పోరుకు సిద్దమయ్యాయి. సిరీస్లో నిలవాలంటే టీమిండియా కచ్చితంగా గెలవాలి. ఇప్పటికే రెండు మ్యాచుల్లో గెలుపొందిన విండీస్ ఈ మ్యాచ్లో విజయం సాధిస్తే సిరీస్ సొంతం చేసుకుంటుంది. అమెరికాలోని ఫ్లోరిడా(Florida)లో జరుగుతున్న ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన విండీస్ కెప్టెన్ రొవమన్ పావెల్(Rovman Powell) బ్యాటింగ్ తీసుకున్నాడు.
మూడో టీ20కి దూరమైన జేసన్ హోల్డర్ తుది జట్టులోకి వచ్చాడు. రోస్టన్ ఛేజ్ స్థానంలో ఓడియన్ స్మిత్, జాన్సన్ చార్లెస్ స్థానంలో షై హోప్ను తీసుకున్నారు. హార్దిక్ పాండ్యా(Hardhik Pandya) సారథ్యంలోని యువ భారత్ మాత్రం అదే జట్టుతో బరిలోకి దిగుతోంది.
భారత జట్టు : యశస్వీ జైస్వాల్, శుభ్మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా(కెప్టెన్), సంజూ శాంసన్(వికెట్ కీపర్), అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, యజువేంద్ర చాహల్, అర్ష్దీప్ సింగ్, ముకేశ్ కుమర్.
వెస్టిండీస్ జట్టు : కైలీ మేయర్స్, బ్రాండన్ కింగ్, షై హోప్ , నికోలస్ పూరన్(వికెట్ కీపర్), షిమ్రాన్ హెట్మైర్, రొవ్మన్ పావెల్(కెప్టెన్), ఒడియన్ స్మిత్, జేసన్ హోల్డర్, రొమారియో షెపర్డ్, అకీల హొసేన్, అల్జారీ జోసెఫ్, ఒబెడ్ మెక్కాయ్.