westindies-vs-india-3rd-T-20 | టీం ఇండియా-వెస్టిండీస్ మధ్య జరుగుతున్న మూడో టీ-20 మ్యాచ్లో నిర్ణీత 20 ఓవర్లు ముగిసే సమయానికి వెస్టిండీస్ నాలుగు వికెట్లు కోల్పోయి 164 పరుగులు చేసింది. టీం ఇండియా ముందు 165 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. చివరి ఓవర్ అర్ధదీప్ సింగ్ వేసిన ఐదో బంతి కొట్టిన శిమ్రాన్ హెట్మర్ పరుగు తీస్తూ రనౌట్ అయ్యాడు. అంతకుముందు ఇదో ఓవర్ మూడో బంతిని ఆడిన రోవ్మన్ పావెల్ కొట్టిన బంతిని హూడా క్యాచ్ పట్టాడు.దీంతో వెస్టిండీస్ నాలుగో వికెట్ కోల్పోయింది.
అంతకుముందు టీం ఇండియా బౌలర్లను చెండాడుతున్న వెస్టిండీస్ ఓపెనర్ క్లే మేయర్స్.. భువనేశ్వర్ బౌలింగ్లో రిషబ్ పంత్కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ బాట పట్టాడు. అప్పటికీ క్లే మేయర్స్ స్కోర్ 73 పరుగులు. అంతకుముందు 5 ఓవర్లో భువనేశ్వర్ బౌలింగ్లో 14వ ఓవర్లో నాలుగో బంతిని ఆడబోయిన వెస్టిండీస్ సారధి నికోలస్ పూరన్ నేరుగా రిషబ్ పంత్కు క్యాచ్ ఇచ్చాడు. దీంతో వెస్టిండీస్ రెండో వికెట్ కోల్పోయింది.