హైదరాబాద్, నమస్తే తెలంగాణ ఆట ప్రతినిధి: హైదరాబాద్ను గోల్ఫ్ హబ్గా మార్చేందుకు కృషి చేస్తున్నామని, త్వరలో నగరంలో జాతీయస్థాయి పోటీలు నిర్వహించేందుకు ప్రణాళికలు రచిస్తున్నామని భారత హ్యాండ్బాల్ సమాఖ్య (హెచ్ఎఫ్ఐ) అధ్యక్షుడు, టీ స్పోర్ట్స్ చైర్మన్ జగన్మోహన్ రావు అన్నారు. ఆదివారం నగరంలోని బౌల్డర్హిల్స్ కోర్సులో నిర్వహించిన టీ గోల్ఫ్ టోర్నమెంట్ను చెస్ గ్రాండ్మాస్టర్ ద్రోణవల్లి హారిక ప్రారంభించింది. ఈ కార్యక్రమంలో టీ గోల్ఫ్ అధ్యక్షుడు ఎన్.ఆర్.ఎన్.రెడ్డి, తెలంగాణ బ్యాడ్మింటన్ సంఘం ఉపాధ్యక్షుడు చాముండేశ్వరీనాథ్ తదితరులు పాల్గొన్నారు. కాగా టోర్నీలో మొత్తం 104 ప్లేయర్లు పోటీ పట్టారు.