హైదరాబాద్, ఆట ప్రతినిధి: జాతీయ హ్యాండ్బాల్ సమాఖ్య (హెచ్ఎఫ్ఐ)లో ఇటీవల చోటు చేసుకున్న పరిణామాలను పరిశీలించిన ఆసియా హ్యాండ్బాల్ ఫెడరేషన్ (ఏహెచ్ఎఫ్) కీలక నిర్ణయం తీసుకుంది. అత్యవసర ఏజీఎమ్లో ప్రీతిపాల్సింగ్, ప్రదీప్ కుమార్ను తొలగిస్తూ హెచ్ఎఫ్ఐ అధ్యక్షుడు జగన్మోహన్రావు నిర్ణయాన్ని ఏహెచ్ఎఫ్ ఆమోదించింది. తమ అధికారిక వెబ్సైట్లో జగన్ను అధ్యక్షుడిగా ప్రకటించిన ఏహెచ్ఎఫ్.. ప్రీతిపాల్, ప్రదీప్ పేర్లను, ఫొటోలను తొలిగించింది. మరోవైపు లక్నోలో జాతీయ జూనియర్ బాలికల హ్యాండ్బాల్ టోర్నీని విజయవంతంగా నిర్వహించడంపై హెచ్ఎఫ్ఐని అంతర్జాతీయ హ్యాండ్బాల్ సమాఖ్య అభినందించింది.