న్యూఢిల్లీ: న్యూజిలాండ్తో రెండవ టెస్టు ముగిసిన తర్వాత టీమిండియా దక్షిణాఫ్రికాలో పర్యటించాల్సి ఉంది. అయితే ఒమిక్రాన్ వేరియంట్ ఆందోళన నేపథ్యంలో ఆ టూర్పై సందిగ్ధం నెలకొన్నది. దీనిపై ఇవాళ క్రికెటర్ విరాట్ కోహ్లీ స్పందించారు. సౌతాఫ్రికా టూర్పై క్లారిటీ కోసం బీబీసీఐతో చర్చిస్తున్నట్లు కోహ్లీ చెప్పాడు. అయితే దక్షిణాఫ్రికాతో ప్రారంభం కావాల్సిన క్రికెట్ సిరీస్ వారం రోజులు వాయిదా పడే అవకాశాలు ఉన్నట్లు ఇవాళ ఉదయం నుంచి వార్తలు వస్తున్నాయి. నిజానికి ఈ సిరీస్ డిసెంబర్ 17వ తేదీ నుంచి ప్రారంభం కావాల్సి ఉంది. రెండు దేశాల క్రికెట్ బోర్డుల మధ్య టూర్ గురించి చర్చలు జరుగుతున్నాయని, బహుశా ఒక వారం పాటు టూర్ వాయిదాపడే అవకాశాలు ఉన్నట్లు బీసీసీఐ వర్గాల ద్వారా తెలిసింది. దక్షిణాఫ్రికా టూర్లో ఇండియా మూడు టెస్టులు, మూడు వన్డేలు, నాలుగు టీ20లు ఆడనున్నది.