న్యూఢిల్లీ: ప్రపంచకప్లో సత్తా చాటుతూ టేబుల్ టాపర్గా కొనసాగుతున్న భారత క్రికెట్ జట్టు శుక్రవారం మధ్యాహ్నం హిమాచల్ప్రదేశ్ రాష్ట్రం కాంగ్రా జిల్లాలోని ధర్మశాలకు చేరుకుంది. ఈ నెల 22న ధర్మశాల క్రికెట్ స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య మ్యాచ్ జరుగనుంది. ఇప్పటికే ఆడిన నాలుగు మ్యాచ్లలో విజయాలతో ఇరు జట్లూ ఎనిమిదేసి పాయింట్లతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతున్నాయి. ఇప్పుడు భారత్-న్యూజిలాండ్ 5వ మ్యాచ్ ఆడేందుకు సిద్ధమయ్యాయి.
ఇరు జట్లూ ఎనిమిదేసి పాయింట్లతో సమంగా ఉన్నప్పటికీ స్వల్ప రన్ రేట్ తేడావల్ల పాయింట్ల పట్టికలో న్యూజిలాండ్ అగ్ర స్థానంలో, భారత్ రెండో స్థానంలో కొనసాగుతున్నాయి. న్యూజిలాండ్ టీమ్ ఇంగ్లండ్, నెదర్లాండ్స్, బంగ్లాదేశ్, అఫ్ఘానిస్థాన్ జట్లపై విజయాలు సాధించగా, టీమిండియా ఆస్ట్రేలియా, పాకిస్థాన్, అఫ్ఘానిస్థాన్, బంగ్లాదేశ్ జట్లపై విజయాలు నమోదు చేసింది. ఈ నేపథ్యంలో ఐదో మ్యాచ్ కోసం టీమిండియా ధర్మశాలకు వచ్చేసింది.