ముంబై : ఈ నెలలో దక్షిణాఫ్రికాతో జరిగే వన్డే సిరిస్కు ముందు టీమిండియాకు షాక్ తగిలింది. ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ కరోనా పాజిటివ్గా తేలింది. దక్షిణాఫ్రికాతో జరిగే వన్డే సిరిస్కు ముందు ఈ ఆల్రౌండర్ మహమ్మారి బారినపడడంతో సిరిస్కు అందుబాటులో ఉంటాడా? లేదా? అనేది సందేహాస్పదంగా మారింది. సౌతాఫ్రికాతో జరిగే వన్డే, టీ20 జట్టుకు బీసీసీఐ సుందర్ను ఎంపిక చేసింది.
గత రెండు దేశవాళీ సీజన్లలో ఫుల్ఫామ్ను ప్రదర్శించాడు. అదే ఫామ్ను దక్షిణాఫ్రికాలో కొనసాగించాలని ఆశిస్తున్నాడు. ఈ క్రమంలో వైరస్కు పాజిటివ్గా పరీక్షించినా.. కోలుకున్న తర్వాత దక్షిణాఫ్రికాకు వెళ్లేందుకు అనుమతి ఇస్తారా? లేదా? తెలియాల్సి ఉంది. ఈ నెల 19 నుంచి దక్షిణాఫ్రికాలో వన్డే సిరిస్ ప్రారంభం కానున్నది. కాగా, ఇప్పటికే గాయం కారణంగా హిట్మ్యాన్ రోహిత్శర్మ జట్టుకు దూరమయ్యాడు. దీంతో కేఎల్ రాహుల్ జట్టుకు నాయకత్వం వహించనున్నాడు.
దక్షిణాఫ్రికాతో వన్డే సిరిస్కు భారత జట్టు
కేఎల్ రాహుల్ (కెప్టెన్), శిఖర్ ధావన్, రుతురాజ్ గైక్వాడ్, విరాట్ కోహ్లీ, సూర్య కుమార్ యాదవ్, శ్రేయాస్ అయ్యర్, వెంకటేష్ అయ్యర్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్ ), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), వై చాహల్, ఆర్ అశ్విన్, వాషింగ్టన్ సుందర్, జస్ప్రీత్ బూమ్రా, భువనేశ్వర్ కుమార్, దీపక్ చాహర్, ప్రసిద్ధ్ కృష్ణ, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ సిరాజ్.