హైదరాబాద్, ఆట ప్రతినిధి: హర్షిత్ చౌదది (62 బంతుల్లో 11 ఫోర్లు, 7 సిక్స్లతో 121 నాటౌట్) అజేయ శతకంతో రెచ్చిపోవడంతో టీజీ 20లీగ్లో వరంగల్ వారియర్స్ బోణీ కొట్టింది. బుధవారం ఆ జట్టు.. ఖమ్మం ఏసెస్పై ఐదు వికెట్ల తేడాతో గెలిచింది. మొదట బ్యాటింగ్ చేసిన ఖమ్మం.. మయాంక్ గుప్తా (54), మికిల్ జైస్వాల్ (54) రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 202 రన్స్కు ఆలౌట్ అయింది.
అనంతరం ఛేదనలో హర్షిత్.. ఖమ్మం బౌలర్లను చెడుగుడు ఆడుకోవడంతో వారియర్స్.. 18.5 ఓవర్లలో ఐదు వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది. మరో మ్యాచ్లో నల్లగొండ నైట్స్ 6 వికెట్ల తేడాతో కరీంనగర్ డైమండ్స్పై గెలిచింది.