Handball | కొత్తపల్లి, ఫిబ్రవరి 19 : కరీంనగర్ జిల్లా కేంద్రంలోని 52వ రాష్ట్ర స్థాయి హ్యాండ్బాల్ టోర్నీలో వరంగల్, రంగారెడ్డి విజేతలుగా నిలిచాయి. మూడు రోజుల పాటు సాగిన పోటీలు సోమవారం ముగిశాయి. పురుషుల విభాగం ఫైనల్లో వరంగల్ జట్టు హైదరాబాద్పై అద్భుత విజయం సాధించింది. కరీంనగర్, రంగారెడ్డి వరుసగా మూడు, నాలుగు స్థానాల్లో నిలిచాయి.
మహిళల తుది పోరులో రంగారెడ్డి టీమ్..వరంగల్పై గెలిచింది. కరీంనగర్కు కాంస్యం, హైదరాబాద్కు నాలుగో స్థానం దక్కింది. కరీంనగర్ హ్యాండ్బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు వెంకటేశ్వర్రావు, కార్యదర్శి లక్ష్మణ్ పాల్గొన్నారు. విజేత జట్లకు ఢిల్లీ డిఫెన్స్ అకాడమీ చైర్మన్ సతీశ్రెడ్డి, రాష్ట్ర హ్యాండ్బాల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి పవన్కుమార్, రమేశ్, ప్రభాకర్ బహుమతులు ప్రదానం చేశారు.