న్యూఢిల్లీ: ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్లో టీమ్ఇండియా ఓపెనర్ రోహిత్ శర్మ, న్యూజిలాండ్ పేసర్ ట్రెంట్ బౌల్ట్ మధ్య జరిగే పోరు కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని భారత మాజీ ప్లేయర్ వీరేంద్ర సెహ్వాగ్ అన్నాడు. బౌల్ట్ ఇన్స్వింగ్ బంతులను రోహిత్ ఎలా ఢీకొడతాడోనని వేచిచూస్తున్నట్టు శనివారం ఓ ఇంటర్వ్యూలో వీరూ చెప్పాడు. కివీస్ పేస్ ద్వయం బౌల్ట్ – టిమ్ సౌథీ భారత్కు సవాళ్లు విసురుతారనడంతో సందేహం లేదు. వారు రెండు వైపులా బంతిని స్వింగ్ చేయగలరు. బౌల్ట్, రోహిత్ మధ్య పోటీ కోసం నేను మరింత ఆసక్తిగా ఎదురుచూస్తున్నా. బౌల్డ్ను రోహిత్ దీటుగా ఎదుర్కొని సుదీర్ఘంగా నిలబడితే చూసేందుకు కనుల విందుగా ఉంటుంది. 2014లో ఇంగ్లండ్లో ఆడిన అనుభవం రోహిత్కు ఉపయోగపడుతుంది అని సెహ్వాగ్ చెప్పాడు.