మణికొండ, ఫిబ్రవరి 20: వికారాబాద్ వేదికగా ఈ నెల 21నుంచి 24వ తేదీ వరకు వూటీ గోల్ఫ్ కౌంటీ జరుగబోతున్నది. ప్రొఫెషనల్ గోల్ఫ్ టూర్ ఆఫ్ ఇండియా (పీజీటీఐ)లో భాగంగా డ్రీమ్వ్యాలీ గ్రూపు సహకారంతో వూటీ మాస్టర్స్ టోర్నీ నిర్వహిస్తున్నారు. ఇందులో భారత టాప్ గోల్ఫర్లుగా పేరొందిన మను గందాస్, అమన్రాజ్, కరణ్ప్రతాప్సింగ్, రాహిల్ గాంజీ, ఉదయన్ మానె బరిలోకి దిగుతున్నారు.
వీరికి తోడు శ్రీలంకకు చెందిన తంగరాజా, ప్రభాకరన్, జమాల్ హుస్సేన్, బాదల్ హుస్సేన్ (బంగ్లాదేశ్), కెవిన్ ఎస్టెవె, సుకుర బహదూర్రాయ్ (నేపాల్), మతియాస్ డోమినెజ్ సుభాశ్ తమంగ్ లాంటి గోల్ఫర్లు పోటీకి సై అంటున్నారు. టోర్నీ ప్రైజ్మనీ రూ.కోటి ప్రకటిస్తున్నట్లు డ్రీమ్వ్యాలీ గ్రూపు ఎండీ సంతోష్రెడ్డి మంగళవారం పేర్కొన్నారు.