హైదరాబాద్, ఆట ప్రతినిధి: వాలీబాల్ క్లబ్ ప్రపంచ చాంపియన్షిప్నకు భారత్ ఆతిథ్యమివ్వబోతున్నది. వాలీబాల్ వరల్డ్, ఎఫ్ఐవీబీ మంగళవారం అధికారిక ప్రకటనలో ధృవీకరించాయి. ప్రైమ్ వాలీబాల్ లీగ్(పీవీఎల్)తో కలిసి రెండేండ్ల పాటు కొనసాగేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఇందులో భాగంగా వాలీబాల్ పవర్హౌజ్లుగా వెలుగొందుతున్న ఇటలీ, బ్రెజిల్, ఇరాన్తో కలిసి ఆతిథ్య హోదాలో భారత్ బరిలోకి దిగనుంది. ప్రైమ్వాలీబాల్ లీగ్ 2023, 2024 ఎడిషన్లలో విజేతగా నిలిచిన జట్టు మెగాటోర్నీకి అర్హత సాధిస్తుంది. డిసెంబర్ 6 నుంచి 10వ తేదీ వరకు జరిగే అవకాశమున్న టోర్నీ ఆతిథ్య నగరాన్ని ఈ ఏడాది ఆఖర్లో ప్రకటించనున్నారు.