స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ భామ అనుష్క శర్మ జోడీ భారీ ఖర్చుతో ఒక ఫాంహౌస్ కొనుగోలు చేసింది. ముంబై దక్షిణాన ఉండే అలీబాగ్లో ఒక ఫాంహౌస్ను ఈ జంట కొనుగోలు చేసినట్లు సమాచారం. ఈ ఫాంహౌస్ మొత్తం 9 వేల చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉందట. దీని ధర రూ.19.24 కోట్లని తెలుస్తోంది. ఈ ఫాంహౌస్ కొనుగోలు కోసం డిపాజిట్గా ప్రభుత్వ ఖజానాకు కోహ్లీ జంట రూ.1.15 కోట్లు చెల్లించింది.
అలాగే స్టాంప్ డ్యూటీ కింద మరో రూ.3.35 లక్షలు కూడా కట్టేసింది. ప్రస్తుతం ఆసియా కప్ ఆడుతున్న కోహ్లీ దుబాయ్లో ఉన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే కోహ్లీ తరఫున అతని సోదరుడు వికాస్ కోహ్లీ ఈ ట్రాన్సాక్షన్ పూర్తిచేశాడు. ఇంతకుముందు మరో బాలీవుడ్ జోడీ దీపికా, రణ్వీర్ సింగ్ కూడా ఈ ప్రాంతంలో రూ.22 కోట్లు పెట్టి బంగ్లా కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే.