IPL 2023 : ఐపీఎల్ ఫ్రాంచైజీ చెన్నై సూపర్ కింగ్స్( Chennai Super Kings,) కెప్టెన్సీ గురించి టీమిండియా డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్(Virender Sehwag) ఆసక్తికర కామెంట్ చేశాడు. సీఎస్కే భావి కెప్టెన్గా ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్(Ruturaj Gaikwad) సరైనోడని అన్నాడు. మహేంద్ర సింగ్ ధోనీ(MS Dhoni) తర్వాత సీఎస్కే సారథ్య బాధ్యతలను 26 ఏళ్ల రుతురాజ్కు అప్పగించాలని అతను అభిప్రాయపడ్డాడు. ‘ఐపీఎల్ 2021లో రుతురాజ్ అద్భుతంగా రాణించాడు. అయినా కూడా ఈ లెఫ్ట్ హ్యాండర్కు భారత్కు ఆడేందుకు ఎక్కువ అవకాశాలు
రాకపోవడం చూసి ఆశ్చర్యపోయా. ఈ సీజన్లో అతను అద్భుతంగా ఆడితే.. టీమిండియాకు ఆడేందుకు వేచి చూడాల్సిన అవసరం ఉండదు’ అని సెహ్వాగ్ తెలిపాడు. 2021 ఐపీఎల్లో రుతురాజ్ చెలరేగి ఆడాడు. 16 మ్యాచుల్లో 635 రన్స్ చేశాడు. అందులో ఒక సెంచరీ, నాలుగు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 16వ సీజన్ ఆరంభ పోరులో కూడా ఈ విధ్వంసక ఓపెనర్ వీరవిహారం చేశాడు. గుజరాత్ టైటన్స్ బౌలర్లను ఉతికి ఆరేసిన అతను 92 పరుగుల వద్ద ఔటయ్యాడు. ప్రస్తుతం ఆరెంజ్ క్యాప్ రేసులో అదరికంటే ముందున్నాడు.
పదహారో సీజన్ ఆరంభ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై 178 రన్స్ కొట్టింది. ఆ తర్వాత శుభ్మన్ గిల్ హాఫ్ సెంచరీతో రాణించి గుజరాత్ను పోటీలో నిలిపాడు. ఆ తర్వాత రషీద్ ఖాన్, రాహుల్ తెవాటియా ఆఖర్లో ధనాధన్ ఆడి జట్టును గెలిపించారు. ఎం.ఎస్.ధోనీకి ఇదే ఆఖరి ఐపీఎల్ సీజన్. దాంతో, అతడిని ఘనంగా వీడ్కోలు పలకాలని సీఎస్కే టీమ్ భావిస్తోంది. ఆ జట్టు ఈరోజు లక్నోసూపర్ జెయింట్స్తో రెండో మ్యాచ్లో తలపడుతోంది. సొంత గ్రౌండ్లో విజయం సాధించి టోర్నీలో బోణీ కొట్టాలని చూస్తోంది.