Virender Sehwag : ఐపీఎల్ 16వ సీజన్(IPL 2023)లో ఈరోజు ఆసక్తికర పోరు జరగనుంది. క్వాలిఫయర్ 1 (Qualifier 1) మ్యాచ్లో డిఫెండింగ్ చాంపియన్ గుజరాత్ టైటాన్స్, నాలుగుసార్లు చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ ఢీ కొంటున్నాయి. దాంతో, ఈ సమఉజ్జీల పోరులో గెలిచేది ఎవరు? అనే ఆసక్తి అందరిలో మొదలైంది. బలాబాలల పరంగా చూస్తే రెండు జట్లు పటిష్టంగానే కనిపిస్తున్నాయి. అంతేకాదు ఇరుజట్లలో మ్యాచ్ విన్నర్లు ఉన్నారు. అయితే.. ఈ కీలక పోరులో మిస్టరీ స్పిన్నర్ రషీద్ ఖాన్ గుజరాత్ గెలుపు గుర్రం అవుతాడని మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్(Virender Sehwag) అభిప్రాయం వ్యక్తం చేశాడు.
‘రషీద్ ఖాన్.. గుజరాత్ గెలుపు గుర్రం. ఎందుకంటే..? ఈ సీజన్లో గుజరాత్కు వికెట్ అవసరమైనప్పుడల్లా రషీద్కు బంతి ఇచ్చారు. . హార్దిక్ పాండ్యా అతడిని చాలా అద్భుతంగా ఉపయోగించుకున్నాడు. భాగస్వామ్యాలను విడదీయడమంటే ఈ అఫ్గానిస్థాన్ స్పిన్నర్కు ఎంతో ఇష్టం. అతడి ప్రదర్శన పరంగా 16వ సీజన్లో అతను విజయవంతమైన బౌలర్గా నిలిచాడు’ అని ఈ మాజీ డాషింగ్ ఓపెనర్ తెలిపాడు.
Click here To Watch Video : Rashid Khan claims the first hat-trick of IPL 2023
ఈ సీజన్ ఆరంభ పోరులో సీఎస్కేపై రషీద్ అద్భుత బౌలింగ్తో ఆకట్టకున్నాడు. రెండు వికెట్లు తీయడమే కాకుండా మూడు బంతుల్లో 10 రన్స్ కొట్టి జట్టకు అండగా నిలిచాడు. ఇప్పటివరకు రషీద్ ఖాన్ 14 మ్యాచుల్లో 24 వికెట్లు పడగొట్టాడు. అత్యధిక వికెట్ల వీరుల జాబితాలో సహచరుడు షమీతో సంయుక్తంగా నిలిచాడు. ఈ సీజన్లో తొలి హ్యాట్రిక్ తీసింది కూడా అతనే. పాండ్యా సేన 20 పాయింట్లతో టేబుల్ టాపర్ కావడంలో రషీద్ మ్యాజిక్ ఉంది. గుజరాత్ జట్టు ఆరంగేట్రం చేసిన సీజన్లో ఐపీఎల్ ట్రోఫీ నెగ్గడంలో అతను కీలక పాత్ర పోషించాడు. 16 మ్యాచుల్లో 19 వికెట్లు తీసి సత్తా చాటాడు.