న్యూఢిల్లీ: భారత స్టార్ క్రికెటర్, ఇండియన్ క్రికెట్ టీమ్ మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఆస్తుల విలువ రూ.1000 కోట్లు దాటింది. ప్రస్తుతం విరాట్ కోహ్లీ స్థిర, చర ఆస్తుల విలువ మొత్తం కలిపి రూ.1050 కోట్లకు చేరిందని తాజాగా ఓ నివేదిక స్పష్టం చేసింది. అంతర్జాతీయ క్రికెట్లో ప్రస్తుతం ఆడుతున్న క్రికెటర్లలో మరే క్రికెటర్ ఆస్తులు రూ.1000 కోట్లు దాటలేదని ఆ నివేదిక పేర్కొన్నది.
భారత్లోనేగాక ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది క్రికెటర్లు విరాట్ కోహ్లీకి వీరాభిమానులుగా ఉన్నారు. దాంతో వరల్డ్ వైడ్గా పెద్దపెద్ద వ్యాపార సంస్థలు విరాట్ కోహ్లీతో యాడ్స్ ద్వారా తమ ఉత్పత్తులను మార్కెటింగ్ చేసుకునేందుకు పోటీపడుతున్నాయి. ప్రస్తుతం 18 కంపెనీల నుంచి కోహ్లీకి యాడ్స్ రూపంలో ఆదాయం సమకూరుతున్నది.
అదేవిధంగా కోహ్లీ స్టార్టప్ కంపెనీల్లో కూడా తన సంపదను పెట్టుబడిగా పెడుతున్నాడు. ప్రస్తుతం 8 స్టార్టప్స్లో కోహ్లీ ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి. అదేవిధంగా సోషల్ మీడియాలో కూడా కోహ్లీ భారీగా ఆదాయం సమకూరుతున్నది. కోహ్లీ తాను ట్విటర్లో చేసే ఒక్కో పోస్టుకు రూ.2.5 కోట్లు, ఇన్స్టాగ్రామ్లో చేసే ఒక్కో పోస్టుకు రూ.8.9 కోట్ల చొప్పున వసూలు చేస్తున్నాడు.
ఇదిలావుంటే కోహ్లీకి భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) నుంచి ప్రతి ఏడాది వార్షిక వేతనంగా రూ.7 కోట్లు అందుతుంది. మరోవైపు ప్రతి ఐపీఎల్ సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) ఫ్రాంచైజీ రూ.15 కోట్ల వేతనం చెల్లిస్తుంది. వీటికి అదనంగా ప్రతి మ్యాచ్కు మ్యాచ్ ఫీజు కూడా ఉంటుంది. ఇన్ని రకాలు వచ్చే ఆదాయంతో ప్రస్తుతం విరాట్ కోహ్లీ ఆస్తులు విలువ రూ.1000 కోట్ల మార్క్ దాటింది.