న్యూఢిల్లీ: ఇంగ్లండ్తో మిగిలిన మూడు టెస్టు మ్యాచ్లకు టీమ్ఇండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ అందుబాటులో ఉండే అవకాశాలు కనిపించడం లేదు. వ్యక్తిగత కారణాలతో ఇప్పటికే తొలి రెండు టెస్టులకు దూరమైన కోహ్లీ ఈ నెల 15నుంచి రాజ్కోట్లో మొదలయ్యే మూడో టెస్టుతో పాటు రాంచీలో జరిగే నాలుగో టెస్టుకు జట్టులోకి వచ్చే అవకాశాలు లేనట్లు తెలిసింది.
ఈ విషయాన్ని బీసీసీఐ వర్గాలు బుధవారం పేర్కొన్నాయి. అయితే ధర్మశాలలో మార్చి 7నుంచి మొదలయ్యే ఆఖరి టెస్టుకైనా కోహ్లీ అందుబాటులో ఉంటాడా అన్నది అనుమానంగా మారింది. కోహ్లీ, అనుష్క రెండో సంతానం కోసం ఎదురుచూస్తున్నట్లు దక్షిణాఫ్రికామాజీ కెప్టెన్ ఏబీ డివిలీయర్స్ పేర్కొన్న సంగతి తెలిసిందే.