ఆస్ట్రేలియాతో జరిగిన నిర్ణయాత్మకమైన మూడో టీ20లో స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ అదరగొట్టాడు. హాఫ్ సెంచరీతో ఆకట్టుకొని జట్టును విజయతీరాలకు చేర్చాడు. చివరి ఓవర్లో 11 పరుగులు అవసరమైన స్థితిలో తొలి బంతికే భారీ సిక్సర్ బాది టెన్షన్ తగ్గించాడు. మ్యాచ్ అనంతరం అవార్డులు అందిస్తుండగా.. ‘మోస్ట్ ఎనర్జిటిక్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డును కోహ్లీ అందుకున్నాడు.
ఈ అవార్డు అందుకున్న కోహ్లీ స్ప్రింటర్లా పరిగెడుతూ తన జట్టును చేరుకున్నాడు. ఎనర్జిటిక్ ప్లేయర్ అవార్డు కదా అందుకే కోహ్లీ ఇలా చేశాడు. అతను చేసిన ఈ పని చూసి యుజ్వేంద్ర చాహల్, గ్లెన్ మ్యాక్స్వెల్ తెగ నవ్వుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది.
అలాగే మ్యాచ్ అనంతరం కోహ్లీ మాట్లాడుతూ.. మిడిల్ ఓవర్లలో భారీ షాట్లు ఆడేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పాడు. మ్యాచ్ అంత దూరం వచ్చి ఉండాల్సింది కాదని, చివరి ఓవర్కు 4-5 పరుగులు మాత్రమే మిగలాల్సిందని అన్నాడు. అలా జరగకపోవడంతో చివరి ఓవర్లో ఒక్క బౌండరీ తీసుకురావడం ముఖ్యమన్నాడు. తొలి బంతికే సిక్సర్ బాదాడు. జట్టుకు తను చేసిన దాని పట్ల సంతోషంగా ఉన్నట్లు చెప్పాడు. జట్టు కోసం చేయగలిగినంత చేస్తానని స్పష్టం చేశాడు.
Virat after getting the "Energetic player of the series" Award😭😂😭😅 #KingKohli #ViratKohlipic.twitter.com/XwzRNBT3me
— Ana de Armas stan (@abhithecomic) September 26, 2022