టీ20 ప్రపంచకప్లో భారత్-పాక్ మ్యాచ్ చూడటం కోసం ప్రపంచం మొత్తం ఆగిపోయిందనడం అతిశయోక్తేమీ కాదు. ఆ మ్యాచ్కు వచ్చిన వ్యూయర్షిప్ రికార్డులు చూస్తేనే ఆ విషయం తెలుస్తుంది. ఈ మ్యాచ్లో పాక్ హీరో షహీన్ షా అఫ్రిదీ.. ఇటీవల జరిగిన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడాడు. భారత్తో మ్యాచ్ సమయంలో డ్రెస్సింగ్ రూమ్ చాలా సరదాగా ఉందన్నాడు.
తమ జట్టులో చాలా మంది భారత్తో తొలిసారి ఆడుతున్నారని, అందుకే అంతా సరదాగా గడిచిందని చెప్పాడు. ‘ఒకవేళ షహీన్ షా చేయలేకపోతే, హసన్ అలీ చేస్తాడు.. లేదంటే హారిస్ రవూఫ్ ఉన్నాడు.. ఇలా అనుకున్నాం. అదృష్టవశాత్తూ మేం కరెక్ట్ వైపు ఉన్నాం’ అన్నాడు.
అదే సమయంలో భారత బ్యాటింగ్ లైనప్ను అఫ్రిదీ మెచ్చుకున్నాడు. రోహిత్, రాహుల్, విరాట్ కోహ్లీ ప్రపంచంలో అత్యుత్తమ ఆటగాళ్లని ప్రశంసించాడు. వీరిలోకూడా కోహ్లీ భారత జట్టు వెన్నెముక వంటి వాడని, అతన్ని అవుట్ చేయడానికి చాలా ఆలోచించానన్నాడు.
‘ఆ గ్రౌండ్లో నేను బౌలింగ్ చేస్తున్న ఎండ్లో లెగ్సైడ్ బౌండరీ చిన్నది. నేను గనుక స్ట్రెయిట్గా ఎంత వేగంతో బంతులు వేసినా.. కోహ్లీ వాటిని ఫ్లిక్తో లేదంటే పుల్తో బౌండరీలు బాదేవాడు. అందుకే బాగా ఆలోచించి స్లో బౌన్సర్ వేశా.. దీంతో అతను లెగ్సైడ్ ఆడటం కష్టమైంది’ అని వివరించాడు. కోహ్లీ అంటే తనకు చాలా అభిమానమని చెప్పాడు.