మొహాలీ: శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నది. విరాట్ కోహ్లీకి ఇది వందో టెస్టు కావడం విశేషం. ఇండియాకు కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టడం గౌరవంగా ఉందని రోహిత్ శర్మ అన్నాడు. కెప్టెన్సీ గురించి తానెప్పుడూ కలకనలేదని, ఈ మ్యాచ్లో ముగ్గురు స్పిన్నర్లు, ఇద్దరు పేస్ బౌలర్లతో రంగంలోకి దిగుతున్నట్లు రోహిత్ తెలిపాడు. ఇక కెరీర్లో వందో టెస్టు ఆడుతున్న విరాట్ కోహ్లీని మ్యాచ్కు ముందు సన్మానించారు. కోచ్ రాహుల్ ద్రావిడ్.. కోహ్లీకి ప్రత్యేక క్యాప్ను బహూకరించాడు.
భారత జట్టు
రోహిత్ శర్మ, మయాంక్ అగర్వాల్, హనుమా విహారి, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్, రవీంద్ర జడేజా, ఆశ్విన్, జయంత్ యాదవ్, షమీ, బుమ్రా
శ్రీలంక జట్టు
కరుణరత్నే, తిరుమణ్నే, నిషాంక, మాథ్యూస్, డి సిల్వా, అసలంక, డిక్వెల్లా, లాక్మల్, ఎంబుదెల్నియా, ఫెర్నాండో, కుమారా