కోల్కతా: టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ.. బయోబబుల్ బ్రేక్ తీసుకున్నాడు. కోల్కతాలో వెస్టిండీస్తో జరుగుతున్న టీ20 సిరీస్లో ఆడుతున్న అతనికి ఇవాళ బీసీసీఐ ఇంటికి వెళ్లేందుకు అనుమతి ఇచ్చింది. ఆదివారం విండీస్తో మూడవ టీ20 మ్యాచ్ జరగనున్న విషయం తెలిసిందే. అయితే రెండవ మ్యాచ్లో కోహ్లీ కీలక ఇన్నింగ్స్ ఆడాడు. కోహ్లీ 41 బంతుల్లో ఏడు ఫోర్లు, సిక్సర్తో 52 రన్స్ చేశాడు. కరోనా ఆంక్షల్లో భాగంగా బయోబబుల్ నియమావళిని అమలు చేస్తున్న విషయం తెలిసిందే. వైరస్ వ్యాప్తిని అరికట్టే ఉద్దేశంతో స్టేడియంలో ప్రేక్షకులు లేకుండానే టోర్నీ నిర్వహిస్తున్నారు. అయితే ఏ కారణం చేత కోహ్లీ బయోబబుల్ నుంచి బ్రేక్ తీసుకున్నారో స్పష్టంగా తెలియదు.