బెంగుళూరు: ఆర్సీబీ బ్యాటర్ విరాట్ కోహ్లీ(Virat Kohli)కి.. మ్యాచ్ ఫీజులో 10 శాతం ఫైన్ పడింది. చెన్నై సూపర్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినట్లు బీసీసీఐ ఒక ప్రకటనలో తెలిపింది. ఆ మ్యాచ్లో 8 పరగుల తేడాతో ఆర్సీబీ ఓడిపోయింది. బెంగుళూరు చిన్నస్వామి స్టేడియంలో జరిగిన మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై 226 రన్స్ చేసింది. ఆ తర్వాత ఆర్సీబీ కూడా దాదాపు విక్టరీకి చేరువైంది. నిర్ణీత ఓవర్లలో 218 రన్స్ మాత్రమే చేసింది.
ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.2 లెవల్ వన్ నేరం కింద కోహ్లీకి మ్యాచ్ ఫీజులో కోత విధించారు. ఎందుకు కోహ్లీకి ఫైన్ వేశారన్న విషయం స్పష్టంగా తెలియదు. కానీ సీఎస్కే బ్యాటర్ శివం దూబూ ఔటైన తర్వాత కోహ్లీ చాలా వైల్డ్గా సెలబ్రేట్ చేసుకున్నాడు. ఆ ఘటన పట్ల బీసీసీఐ చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది. దూబే తన ఇన్నింగ్స్లో కేవలం 26 బంతుల్లో 52 రన్స్ చేశాడు.