మొహాలీ: శ్రీలంకతో మొహాలీలో జరుగుతున్న తొలి టెస్టులో విరాట్ కోహ్లీ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. 45 పరుగులు వ్యక్తిగత స్కోర్ వద్ద అతను ఎబుల్దెనియా బౌలింగ్లో ఔటయ్యాడు. ఆఫ్ స్టంప్పై పడ్డ బంతి నేరుగా వికెట్ను తాకింది. కెరీర్లో వందో టెస్టు ఆడుతున్న కోహ్లీ.. టెస్టుల్లో 8 వేల పరుగుల మైలురాయిని దాటేశాడు. ఈ ఫీట్ను అందుకున్న ఆరవ భారతీయ క్రికెటర్గా నిలిచాడతను. ఇండియా 45 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 173 రన్స్ చేసింది. విహారీ 57, పంత్ ఒక పరుగు చేసి క్రీజ్లో ఉన్నారు.