Virat Kohli : టీమిండియా ఛేజ్ మాస్టర్ విరాట్ కోహ్లీ(Virat Kohli) మరో రికార్డు సొంతం చేసుకున్నాడు. ప్రపంచ టెస్టు చాంపియన్షిప్(WTC) 2019-25 సైకిల్లో భారత కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma) పేరిట ఉన్న రికార్డును బద్ధలు కొట్టాడు. తద్వారా అత్యధిక పరుగులు సాధించిన భారత క్రికెటర్గా విరాట్ రికార్డు సృష్టించాడు. దక్షిణాఫ్రికా గడ్డపై జరుగుతున్న తొలి టెస్టులో 38 పరుగులతో రాణించిన కోహ్లీ హిట్మ్యాన్ రికార్డును అధిగమించాడు.
డబ్ల్యూటీసీ సైకిల్లో కోహ్లీ 57 ఇన్నింగ్స్లలో 2,101 పరుగులు సాధించగా.. రోహిత్ 42 ఇన్నింగ్స్లలో 2,097 రన్స్ స్కోర్ చేశాడు. ఈ జాబితాలో నయావాల్ ఛతేశ్వర్ పూజారా 1,769 పరుగులతో మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. అజింక్యా రహానే(49 ఇన్నింగ్స్ల్లో 1,589 పరుగులు), రిషభ్ పంత్( 41 ఇన్నింగ్స్ల్లో 1,575 ) వరుసగా నాలుగు, ఐదో స్థానాల్లో నిలిచారు.
విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ
డబ్ల్యూటీసీలో భారత జట్టుకు మెరుగైన రికార్డు ఉంది. ఇప్పటివరకూ ఏ జట్టుకు సాధ్యం కానిరీతిలో టీమిండియా రెండుసార్లు ఫైనల్కు చేరింది. అయితే.. ఊహించనివిధంగా రెండుసార్లు టైటిల్ పోరులో తడబడింది. 2021లో లార్డ్స్లో జరిగిన ఫైనల్లో కోహ్లీసేనను న్యూజిలాండ్ ఓడించింది. 2023లో ఓవల్ వేదికగా జరిగిన టైటిల్ పోరులో ఆస్ట్రేలియా.. భారత్ను ఓడించి టెస్టు గదను తన్నుకుపోయింది.