వచ్చే ఏడాది స్వదేశంలో జరిగే మొదటి సిరీస్ని విజయంతో ప్రారంభించాలి అనుకుంటున్న భారత జట్టుకు షాకింగ్ న్యూస్. శ్రీలంకతో జరగనున్న టీ20 సిరీస్కు స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ దూరం కానున్నాడు. తనకు బ్రేక్ కావాలని, శ్రీలంక టీ20 సిరీస్కు తనను ఎంపిక చేయవద్దనని కోహ్లీ బీసీసీఐని కోరినట్టు సమాచారం. దాంతో, అతని ప్లేస్లో యువ ఆటగాడిని జట్టులోకి తీసుకునే అవకాశం ఉంది. అండర్ 19 వరల్డ్ కప్ కెప్టెన్ యశ్ ధూల్తో పాటు మరికొందరి పేర్లు వినిపిస్తున్నాయి. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో యశ్ ధూల్ తొలి టీ 20 మ్యాచ్ ఆడాడు. 131.52 స్ట్రైక్ రేటుతో 363 రన్స్ చేశాడు. దాంతో, పోయిన ఏడాది ఐపీఎల్ వేలంలో అతడిని ఢిల్లీ క్యాపిటల్స్ దక్కించుకుంది.
హార్ధిక్ పాండ్యా కెప్టెన్సీలో భారత్, శ్రీలంకతో, 3 టీ20ల సిరీస్ ఆడనుంది. మొదటి మ్యాచ్ జనవరి 3వ తేదీన మొదలవుతుంది. టీ 20 వలర్డ్ కప్ తర్వాత జరిగిన న్యూజిలాండ్తో టీ 20 సిరీస్కు కోహ్లీ, కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ వంటి సీనియర్ ఆటగాళ్లకు బీసీసీఐ విశ్రాంతి ఇచ్చింది. టీ 20 వరల్డ్ కప్ ముందు ఫామ్ అందిపుచ్చుకున్న కోహ్లీ న్యూజిలాండ్, బంగ్లాదేశ్తో జరిగిన వన్డే సిరీస్లో రాణించాడు. బంగ్లాతో జరిగిన మూడో వన్డేలో సెంచరీ కొట్టాడు. శ్రీలంకతో వన్డే, టెస్టు మ్యాచ్లకు అతను జట్టుతో కలిసే అవకాశం ఉంది.