టీమిండియా స్టార్ బ్యాటర్, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ అందరికీ హోలీ శుభాకాంక్షలు తెలిపాడు. ‘‘ఈ పండుగ అందరి జీవితాలను సంతోషం, శాంతితో నింపాలని ఆశిస్తున్నా’’ అంటూ ట్వీట్ చేశాడీ ఢిల్లీ క్రికెటర్. ఇటీవల శ్రీలంకతో ముగిసిన టెస్టు సిరీస్లో కోహ్లీ పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు. ముఖ్యంగా బెంగళూరు టెస్టులో రెండు ఇన్నింగ్సుల్లో దాదాపు ఒకే రకమైన బంతులకు ఎల్బీడబ్ల్యూగా పెవిలియన్ చేరాడు.
గడిచిన రెండేళ్లుగా అంతర్జాతీయ క్రికెట్లో సెంచరీ లేకుండా ఉన్న కోహ్లీ.. ఈ నెల 26 నుంచి ప్రారంభమయ్యే ఐపీఎల్ తాజా సీజన్లో సత్తా చాటాలని అభిమానులు కోరుకుంటున్నారు. సౌతాఫ్రికా పర్యటన తర్వాత టెస్టు కెప్టెన్సీకి వీడ్కోలు పలికిన కోహ్లీ.. కేవలం బ్యాటర్గానే జట్టులో కొనసాగుతున్నాడు. ఫామ్ అందుకుంటే కోహ్లీకి తిరుగుండదని విశ్లేషకులు కూడా చెప్తున్నారు. కానీ అతను ఫామ్లోకి ఎప్పుడొస్తాడనేదే ప్రశ్నార్థకంగా మారింది.
కాగా, నేషనల్ క్రికెట్ అకాడమీ చైర్మన్గా ఉన్న వీవీఎస్ లక్ష్మణ్ కూడా ప్రజలకు హోలీ శుభాకాంక్షలు తెలిపాడు. ‘‘హోలీ రంగులు అందరి జీవితాల్లో శాంతి, సంతోషం, ప్రేమ, సంపదను నింపాలని ఆశిస్తూ అందరికీ హ్యాపీ హోలీ’’ అని లక్ష్మణ్ ట్వీట్ చేశాడు.
— Virat Kohli (@imVkohli) March 18, 2022
May the colours of Holi spread peace, happiness, love and prosperity all around.
Wishing you a blessed and #HappyHoli pic.twitter.com/2bYKlRwBjO— VVS Laxman (@VVSLaxman281) March 18, 2022