దుబాయ్: ఇండియన్ ప్రిమియర్ లీగ్ 2021( IPL 2021 )లో మిగిలిపోయిన మ్యాచ్లు ఆడేందుకు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లి, పేస్బౌలర్ మహ్మద్ సిరాజ్ ఆదివారం దుబాయ్ చేరుకున్నారు. మీరందరూ ఎదురు చూస్తున్న వార్త.. కింగ్ కోహ్లి, మియా మ్యాజిక్ దుబాయ్లోని టీమ్తో కలిశారు అని ఆర్సీబీ టీమ్ ట్వీట్ చేసింది. ఇప్పటికే ముంబై, ఢిల్లీ, చెన్నై ఫ్రాంచైజీలు తమ టీమ్లలోని స్టార్ ప్లేయర్స్ రాకను ప్రకటించాయి.
ఈ నెల 19 నుంచి ఐపీఎల్ మళ్లీ ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఇంగ్లండ్తో ఐదో టెస్ట్ రద్దు కావడంతో షెడ్యూల్ కంటే ముందుగానే ఇండియన్ టీమ్ ప్లేయర్స్ దుబాయ్ చేరుకున్నారు. ఐపీఎల్ 14వ సీజన్ పాయింట్ల టేబుల్లో ఆర్సీబీ మూడోస్థానంలో ఉంది. ఢిల్లీ, చెన్నై టాప్లో ఉన్న విషయం తెలిసిందే. ఈ నెల 20న కోల్కతా నైట్రైడర్స్తో ఆర్సీబీ తలపడనుంది.