భారత్కు స్వతంత్రం వచ్చి 75 వసంతాలు పూర్తయిన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ‘హర్ ఘర్ తిరంగా’ (ప్రతి ఇంటా త్రివర్ణం) క్యాంపెయిన్కు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. దీనిలో పలువురు సెలెబ్రిటీలు పాల్గొంటున్నారు. టీమిండియా మాజీ సారధి, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ కూడా ఈ క్యాంపెయిన్లో పాల్గొన్నారు. కోహ్లీ, అనుష్క శర్మ జంట కూడా తమ ఇంట మువ్వన్నెల పతాకాన్ని ఎగరేసింది. దీనికి సంబంధించిన ఫొటోను అనుష్క తన ఇన్స్టాగ్రాం ఖాతాలో పోస్టు చేసింది.
‘‘భారత 75వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ప్రపంచం నలుమూలలో ఉన్న భారతీయులందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే.. జై హింద్’’ అని అనుష్క పోస్టు పెట్టింది. కోహ్లీ కూడా ఈ క్యాంపెయిన్లో భాగంగా తన ఇన్స్టాగ్రాం, ట్విట్టర్ హ్యాండిల్స్ ప్రొఫైల్ పిక్గా త్రివర్ణ పతాకాన్ని పెట్టుకున్నాడు. కోహ్లీనేకాదు రోహిత్ శర్మ, జడేజా, హర్భజన్ సింగ్, హార్దిక్ పాండ్యా, సచిన్ టెండూల్కర్ తదితర క్రికెట్ స్టార్లు కూడా తమ తమ ఇళ్లలో మువ్వన్నెల పతాకాన్ని రెపరెపలాడించారు.