Vinesh Phogat | బీజేపీ ఎంపీ, భారత ర్లెజింగ్ ఫెడరేషన్ మాజీ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ వేధింపులకు నిరసనగా మహిళా రెజ్లర్లు చేపట్టిన ఆందోళన ఇంకా కొనసాగుతున్నది. బ్రిజ్ భూషణ్పై చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో గతంలో క్రీడాకారులు నిరసనను విరమించారు. తాజాగా డబ్ల్యూఎఫ్ఐ ఎన్నికల్లో బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ సన్నిహితుడు సంజయ్ సింగ్ అధ్యక్షుడిగా ఎన్నికవడంతో రెజ్లర్లు మరోసారి నిరసనకు దిగారు. మహిళా రెజ్లర్లకు న్యాయం జరగడం లేదంటూ విశేశ్ ఫోగట్ అసంతృప్తిని వ్యక్తం చేసింది. తన ప్రతిభకు గుర్తింపు కేంద్రం అందించిన అవార్డులు అర్జున, ఖేల్రత్న వెనక్కి ఇచ్చేసింది. గత నెల 26న అవార్డులను వాపస్ వేయనున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాసిన విషయం తెలిసిందే.
ఈ క్రమంలో శనివారం వినేశ్ ప్రధానమంత్రి కార్యాలయం ఎదుట ఉన్న మార్గంలో ఖేల్రత్న, అర్జున అవార్డులను వదిలేసి వెళ్లింది. ఆ తర్వాత పోలీసులు వాటిని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను రెజ్లర్ బజరంగ్ పునియా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇంతకు ముందు బజరంగ్ పునియా సైతం అవార్డులను వాపస్ చేసిన విషయం తెలిసిందే. డిసెంబర్ 21న ఇండియన్ రెజ్లింగ్ అసోసియేషన్ ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. ఇందులో అధ్యక్షుడిగా సంజయ్ సింగ్ ఎన్నికయ్యారు. బ్రిజ్ భూషన్లాంటి వ్యక్తిని మళ్లీ ఎంపిక చేస్తే ఏం చేయాలని ప్రశ్నిస్తూ రెజ్లింగ్ నుంచి సాక్షి మాలిక్ రిటైర్మెంట్ ప్రకటించింది. భజరంగ్ తనకు కేంద్రం ప్రకటించిన పద్మశ్రీని సైతం తిరిగి ఇచ్చేశాడు. తాజాగా వినేశ్ ఖేల్రత్న, అర్జున అవార్డులను వెనక్కి ఇచ్చింది.
వినేశ్ ఫోగట్ 2022లో ప్రపంచ రెజ్లింగ్ ఛాంపియన్షిప్లో కాంస్య పతకాన్ని గెలుచుకుంది. 2019లో జరిగిన 2019లో జరిగిన ప్రపంచ ఛాంపియన్షిప్లో కాంస్యం సాధించింది. 2018లో ఆసియా క్రీడలు, కామన్వెల్త్ క్రీడల్లో బంగారు పతకం కైవసం చేసుకున్నది. 2014, 2018, 2022 కామన్వెల్త్ గేమ్స్లో బంగారు పతకం గెలుపొందింది. ప్రతిష్టాత్మక లారెస్ అవార్డుకు ఎంపికైన తొలి భారతీయ అథ్లెట్గా నిలిచింది. వినేశ్ ప్రతిభను గుర్తిస్తూ 2016లో అర్జున అవార్డు, 2020లో మేజర్ ధ్యాన్చంద్ ఖేల్రత్నా అవార్డుతో కేంద్రం సత్కరించింది.
यह दिन किसी खिलाड़ी के जीवन में न आए। देश की महिला पहलवान सबसे बुरे दौर से गुज़र रही हैं। #vineshphogat pic.twitter.com/bT3pQngUuI
— Bajrang Punia 🇮🇳 (@BajrangPunia) December 30, 2023