చెన్నై: సన్రైజర్స్ హైదరాబాద్తో మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేస్తున్న ముంబై ఇండియన్స్కు శుభారంభం లభించింది. క్వింటన్ డికాక్, రోహిత్ శర్మ తొలి వికెట్కు 55 పరుగులు అందించారు. ఓపెనర్లు ఇద్దరూ ఆరంభం నుంచి దూకుడుగా ఆడటంతో పవర్ప్లే ఆఖరికి 53/0తో ముంబై నిలిచింది. దూకుడుగా ఆడుతున్న రోహిత్(32: 25 బంతుల్లో 2ఫోర్లు, 2సిక్సర్లు) 7వ ఓవర్లో ఔటయ్యాడు. విజయ్ శంకర్ బౌలింగ్లో భారీ షాట్కు యత్నించి విరాట్ సింగ్ చేతికి చిక్కాడు. ప్రస్తుతం 8 ఓవర్లకు ముంబై వికెట్ నష్టానికి 64 పరుగులు చేసింది. ప్రస్తుతం డికాక్(22), సూర్యకుమార్ యాదవ్(4) క్రీజులో ఉన్నారు.