WPL 2024 | రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఎట్టకేలకు ట్రోఫీ (డబ్ల్యూపీఎల్) నెగ్గడంతో ఆ జట్టు అభిమానులు సంబురాల్లో మునిగితేలుతున్నారు. స్మృతి మంధాన సారథ్యంలోని ఆర్సీబీ.. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ రెండో సీజన్లోనే కప్పుకొట్టింది. ఈ నేపథ్యంలో ఆర్సీబీ మాజీ యజమాని, ఈ ఫ్రాంచైజీ వ్యవస్థాపకుడు విజయ్ మాల్యా స్పందించాడు. మహిళల జట్టుకు శుభాకాంక్షలు తెలిపిన మాల్యా.. మెన్స్ టీమ్ కూడా కప్ గెలిస్తే ఈసారి ఆనందం డబుల్ అవుతుందని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.
మాల్యా ట్విటర్ (ఎక్స్) వేదికగా స్పందిస్తూ… ‘డబ్ల్యూపీఎల్ ట్రోఫీ నెగ్గిన ఆర్సీబీ మహిళల జట్టుకు హృదయపూర్వక అభినందనలు. ఇదే స్ఫూర్తితో చాలాకాలంగా పెండింగ్లో ఉన్న పురుషుల ట్రోఫీ (ఐపీఎల్)ను నెగ్గితే ఈ ఆనందం డబుల్ అవుతుంది. గుడ్ లక్..’ అని పోస్ట్ చేశాడు.
Heartiest congratulations to the RCB Women’s Team for winning the WPL. It would be a fantastic double if the RCB Men’s Team won the IPL which is long overdue. Good Luck.
— Vijay Mallya (@TheVijayMallya) March 17, 2024
మాల్యా పెట్టిన ఈ పోస్ట్పై నెటిజన్లు ఆసక్తికర కామెంట్స్ చేస్తున్నారు. ‘ఇప్పుడు మనం ఒక డీల్ చేద్దాం. ఒకవేళ ఐపీఎల్ -2024లో గనక ఆర్సీబీ గెలిస్తే నేను ఇండియాకు తిరిగివస్తా అని చెప్పేయండి. చూద్దాం అలా అయినా మీ పురుషుల జట్టు కప్పు కొడుతుందేమో..’, ‘పురుషుల జట్టా..? అంత సీన్ లేదు. అది అవ్వదులే గానీ మీ ఆనందం డబుల్ అవ్వాలంటే మళ్లీ అమ్మాయిలే నెక్స్ట్ సీజన్లో గెలవాలి..’ అని పోస్టులు చేస్తుండగా కొందరు.. ‘ఎస్బీఐ మీకోసం వెయిటింగ్ ఇక్కడ.. ఎప్పుడొస్తున్నారు..?’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. బ్యాంకులకు సుమారు రూ. 9వేల కోట్ల ఎగనామం పెట్టిన విజయ్ మాల్యా.. చాలాకాలంగా యూకేలో ఉంటున్న విషయం విదితమే.
Vijay mallya to RCB mens team😂😭 pic.twitter.com/FHTehkg3wx
— AllHailTheTiger (@msdntr79) March 17, 2024
Meanwhile SBI 😹 pic.twitter.com/IW6zrQ6sgH
— Hardik Bhavsar (Modi Ka Parivar) (@Bitt2DA) March 17, 2024