అహ్మదాబాద్ : విజయ్ హజారే ట్రోఫీ టైటిల్ పోరుకు సౌరాష్ట్ర, మహారాష్ట్ర చేరుకున్నాయి. బుధవారం జరిగిన సెమీఫైనల్స్లో సౌరాష్ట్ర 5 వికెట్ల తేడాతో కర్ణాటకపై, మహారాష్ట్ర 12 పరుగులతో అస్సాంపై విజయాలు నమోదు చేశాయి.
సౌరాష్ట్రతో జరిగిన పోరులో తొలుత కర్ణాటక 171 పరుగులకు ఆలౌట్ కాగా, లక్ష్య ఛేదనలో సౌరాష్ట్ర 13.4 ఓవర్లు మిగిలి ఉండగానే 5 వికెట్లకు 172 పరుగులు చేసి గెలిచింది. మరో సెమీస్లో తొలుత మహారాష్ట్ర 7 వికెట్లకు 350 పరుగులు చేయగా, అస్సాం 8 వికెట్లకు 338 పరుగులే చేసి ఓడిపోయింది. టైటిల్ కోసం సౌరాష్ట్ర, మహారాష్ట్ర శుక్రవారం తలపడనున్నాయి.