Ranji Trophy | నాగ్పూర్: మధ్యప్రదేశ్ బౌలర్లు విజృంభించడంతో రంజీ ట్రోఫీ సెమీఫైనల్లో విదర్భ తొలి ఇన్నింగ్స్లో 170 పరుగులకు ఆలౌటైంది. కరుణ్ నాయర్ (63; 9 ఫోర్లు) అర్ధశతకం చేయగా.. మిగిలినవాళ్లు ఆకట్టుకోలేకపోయారు. మధ్యప్రదేశ్ బౌలర్లలో అవేశ్ ఖాన్ 4, కుల్వంత్, వెంకటేశ్ అయ్యర్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం మధ్యప్రదేశ్ వికెట్ నష్టానికి 47 పరుగులు చేసింది.
మరో సెమీఫైనల్లో ముంబై బౌలర్లు రాణించడంతో తమిళనాడు 146 పరుగులకు ఆలౌటైంది. విజయ్ శంకర్ (44), వాషింగ్టన్ సుందర్ (43) పర్వాలేదనిపించారు. ముంబై బౌలర్లలో తుషార్ 3, శార్దూల్, ముషీర్, తనుశ్ తలా రెండు వికెట్లు తీశారు. అనంతరం ముంబై తొలి ఇన్నింగ్స్లో 2 వికెట్లు కోల్పోయి 45 పరుగులు చేసింది.