BCCI Digital Rights : ప్రముఖ మీడియా సంస్థ వైకోమ్ 18(Viacom 18) క్రికెట్ అభిమానులకు మరింత చేరువ కానుంది. ఇప్పటికే మహిళల ప్రీమియర్ లీగ్(WPL), ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL) మీడియా హక్కులు దక్కించుకున్న ఈ సంస్థ తాజాగా భారత క్రికెట్ బోర్డు(BCCI) డిజిటల్, టీవీ హక్కులు సొంతం చేసుకుంది. ఈ రోజు జరిగిన వేలంలో డిస్నీ స్టార్(Disney Star), సోనీ పిక్చర్స్ నెట్వర్క్స్ ఇండియా(Sony Pictures Networks India) వంటి ప్రధాన పోటీదారులను వెనక్కి నెట్టి మరీ చాన్స్ కొట్టేసింది. అందుకు గానూ బీసీసీఐకి వైకోమ్ 18 సంస్థ భారీగానే డబ్బులు ముట్టజెప్పనుంది.
టీమిండియా ఆడిన ప్రతి మ్యాచ్కు రూ.67.8 కోట్లు చెల్లించనుంది. ఇప్పటి నుంచి ఐదేళ్ల పాటు వైకోమ్ 18 భాతర జట్టు మ్యాచ్లను ప్రసారం చేయనుంది. వారం క్రితమే బీసీసీఐ మీడియా హక్కుల్ని ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్(IDFC first Bank) హస్తగతం చేసుకున్న విషయం తెలిసిందే.
ఈ ఐదేళ్లలో భారత జట్టు 88 మ్యాచ్లు ఆడనుంది. వీటిలో 25 టెస్టులు, 27 వన్డేలు, 36 టీ20 మ్యాచ్లు ఉన్నాయి. వైకోమ్ 18 మీడియా సంస్థ నిరుడు డబ్ల్యూపీఎల్ మీడియా హక్కులు సొంతం చేసుకుంది. అందుకోసం ఏకంగా రూ. 4 వేల(48,490) కోట్లు చెల్లించేందుకు సిద్ధమైంది. ఐదేళ్ల కాలానికి అంటే.. 2023 నుంచి 2027 వరకూ ఐపీఎల్ అధికారిక మీడియాగా వ్యవహరించనుంది.