దుబాయ్: భారత మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తిపై మాజీ ఆల్రౌండర్ సురేష్ రైనా ప్రశంసల వర్షం కురిపించాడు. టీ20 ప్రపంచకప్లో భారత జట్టు బౌలింగ్ దళంలో చక్రవర్తి కీలకం కానున్నాడనే అభిప్రాయం వ్యక్తం చేశాడు. ఐపీఎల్లో యూఏఈ పిచ్లను బట్టి చూస్తే మిస్టరీ స్పిన్నర్లను ఆడటం చాలా చాలా కష్టంగా ఉందని రైనా వెల్లడించాడు.
అదే సమయంలో పిచ్పై పేస్ను చక్రవర్తి చాలా బాగా ఉపయోగించుకోగలడని చెప్పాడు. వరుణ్ ఇప్పటి వరకూ 3 అంతర్జాతీయ టీ20 మ్యాచులే ఆడినప్పటికీ అతనికి అనుభవలేమి అడ్డంకి కాబోదని రైనా అభిప్రాయపడ్డాడు. ఈ మేరకు ఐసీసీకి తాను రాసిన వ్యాసంలో పలు అభిప్రాయాలను వెలిబుచ్చాడు.
భారత పేస్ దళంలో శార్దూల్ ఠాకూర్ చేరిక మరింత బలాన్ని చేకూర్చిందని అన్నాడు. ముఖ్యమైన మ్యాచుల్లో ఒత్తిడిని తట్టుకోవడం వంటి విషయాల్లో భువనేశ్వర్ కుమార్కు బాగా అనుభవం ఉందని చెప్పాడు. గడిచిన రెండేళ్లు కష్టంగా గడిచాయని, అందుకే యూఏఈ, ఒమన్లో ఒక ప్రత్యేక టోర్నీని చూస్తామని అభిప్రాయపడ్డాడు.