హైదరాబాద్: ప్రతిష్ఠాత్మక ఏషియన్ పవర్లిఫ్టింగ్ చాంపియన్షిప్లో రాష్ట్ర యువ లిఫ్టర్ వైష్ణవి మహేశ్ సత్తాచాటింది. కొయంబత్తూరు వేదికగా జరుగుతున్న టోర్నీలో వైష్ణవి ఓవరాల్గా కాంస్య పతకంతో మెరిసింది. సోమవారం జరిగిన84కిలోల విభాగంలో బరిలోకి దిగిన వైష్ణవి స్కాట్లో 152.5కిలోలతో కాంస్యం, బెంచ్ప్రెస్లో 80కిలోలతో కాంస్యం, డెడ్లిఫ్ట్లో 152.5కిలోలతో రజత దక్కించుకుంది.
టైటిల్ ఫెవరేట్లుగా భావించిన ఉజ్బెకిస్థాన్, కజకిస్థాన్, ఒమన్ దేశాల పవర్ లిఫ్టర్లు విఫలమైన చోట వైష్ణవి అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంది. స్థాయికి తగ్గట్టు బరువులు ఎత్తుతూ పోడియం ఫినిష్ చేసి ఆకట్టుకుంది. జాతీయస్థాయిలో నిలకడగా రాణిస్తున్న ఈ హైదరాబాదీ లిఫ్టర్ ఏషియన్ టోర్నీలోనూ తనకు తిరుగులేదని చాటి చెప్పింది. భవిష్యత్లోనూ మరిన్ని పతకాలు సాధించి రాష్ట్ర ఖ్యాతిని ఇనుమడింపజేస్తానని వైష్ణవి ‘నమస్తే తెలంగాణ’కు చెప్పుకొచ్చింది.